మహిళా క్రికెట్లో టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు మనోళ్లే!
- ప్రపంచ కప్ నుంచి వెనుదిరిగిన భారత్
- అయినా సత్తా చాటిన జట్టు సభ్యులు
- బ్యాటింగ్లో ఆరోస్థానంలో మిథాలీ, పదో స్థానంలో స్మృతి
- బౌలింగ్లో ఐదో స్థానంలో ఝులన్ గోస్వామి
ప్రపంచ కప్ నుంచి భారత జట్టు వెనుదిరిగినా... జట్టు సభ్యులు సత్తా చాటారు. ఈ మ్యాచ్లలో రెండు సెంచరీలు నమోదు చేసిన మిథాలీ తన ర్యాంకును మెరుగుపరచుకుని టాప్ 10లోకి దూసుకువచ్చింది. ఇక నిలకడ ప్రదర్శనతో రాణించిన స్మృతి తన పదో స్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్లో సత్తా చాటిన ఝులన్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఐదో స్థానానికి ఎగబాకింది.