Corona Virus: భారత్ లో మరింత తగ్గిన కరోనా కేసులు.. 35 మంది మృతి!

India registers 1259 new Corona cases
  • గత 24 గంటల్లో 1,259 కేసుల నమోదు
  • 98.75 శాతానికి పెరిగిన రికవరీ రేటు
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,378
మన దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,259 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే ఈ సంఖ్య కొంత తక్కువ కావడం గమనార్హం. ఇదే సమయంలో 1,705 మంది కోలుకోగా... 35 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,85,534 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 5,21,070 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్ వేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
Corona Virus
India
Updates

More Telugu News