అసెంబ్లీలో సీఎం జగన్ ను కలిసిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు
- ఉక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు
- చిక్కుకుపోయిన వేలాది విద్యార్థులు
- ఎన్నో చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- విద్యార్థులను స్వదేశానికి తరలించిన కేంద్రం
- సీఎం జగన్ కు జ్ఞాపికలు బహూకరించిన విద్యార్థులు
ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులు నేడు సీఎం జగన్ ను కలిశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం జగన్ చాంబర్ విద్యార్థులతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రికి విద్యార్థులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వీయ చిత్రపటాన్ని బహూకరించారు. మరికొన్ని జ్ఞాపికలు కూడా అందజేశారు. విద్యార్థులతో సీఎం జగన్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.