North Korea: ఉత్తర కొరియా దూకుడుకు ఎదురుదెబ్బ.. గాల్లోనే పేలిపోయిన క్షిపణి

North Korea Silent After Missile Explodes Over Pyongyang
  • భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయిన క్షిపణి
  • ప్రయోగించిన క్షణాల్లోనే ఘటన
  • ప్రయోగంపై మౌనం వహించిన ఉత్తర కొరియా

వరుస క్షిపణి ప్రయోగాలతో ఇటీవల దూకుడు పెంచిన ఉత్తర కొరియాకు ఎదురుదెబ్బ తగిలింది. అది చేపట్టిన క్షిపణి ప్రయోగం విఫలమైంది. భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. ఈ క్షిపణికి సంబంధించిన వివరాలేవీ వెల్లడి కాలేదు. ఉత్తర కొరియా కూడా దీనిపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అధికారిక మీడియా కూడా ఈ ప్రయోగంపై మౌనం వహించింది. ఉత్తర కొరియా ఈ ఏడాది చేపట్టిన పదో ప్రయోగం ఇది. 

దాదాపు మూడు మిలియన్ల మంది నివసించే సునాన్‌ ప్రాంతం నుంచి నిన్న తెల్లవారుజామున బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ క్షిపణి రాజధాని ప్యోంగ్యాంగ్‌పైన పేలిపోయింది. ఆ సమయంలో నగరంపైన ఆకాశంలో ఎర్రటి రంగులతో కూడిన పొగలు, మెరుస్తున్న శకలాలు కిందపడడం కనిపించినట్టు ఎన్‌కే న్యూస్ తెలిపింది.

  • Loading...

More Telugu News