కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో 'కశ్మీర్ ఫైల్స్' చిత్ర బృందం
- కశ్మీరీ పండిట్లపై అకృత్యాలే నేపథ్యంగా సినిమా
- ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు
- పలు రాష్ట్రాల్లో సినిమాకు వినోద పన్ను మినహాయింపు
- తాజాగా అమిత్ షాతో ప్రత్యేక భేటీ
ఇలాంటి నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్ర బృందం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో అమిత్ షాను చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, పల్లవిజోషి, చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను వివేక్ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.