Kids: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు చిన్నారుల మృతి

Three kids died in road accident in Vijayanagaram district
  • టెక్కలివలస వద్ద ఘటన
  • ఓ బైకుపై ఐదుగురి ప్రయాణం
  • బైకు, స్కూలు బస్సు ఢీ
  • ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
  • ఓ చిన్నారికి తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలసలో రహదారి నెత్తురోడింది. ఓ ద్విచక్రవాహనం, స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. తెర్లాం మండలం పెరుమాళ్లకు చెందిన ఐదుగురు ఓ బైకుపై రాజాం జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను రుషి (6), సిద్ధూ (9), హర్ష (6)గా గుర్తించారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో ఘటనస్థలి శోకసంద్రాన్ని తలపిస్తోంది.
Kids
Death
Road Accident
Vijayanagaram District

More Telugu News