'వీరమల్లు' కొత్త షెడ్యూల్ మళ్లీ వాయిదా?
- 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్
- మొగల్ కాలంలో నడిచే కథ
- కథానాయికగా నిధి అగర్వాల్
- ఏప్రిల్ రెండో వారం నుంచి నెక్స్ట్ షెడ్యూల్
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు వేశారు. 50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత కరోనా ప్రభావం వలన షూటింగును వాయిదా వేశారు. మధ్యలో ఒకటి రెండు సార్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసినా కుదరలేదు.
దాంతో 'భీమ్లా నాయక్' విడుదల తరువాత ఈ సినిమాపై దృష్టి పెట్టాలని పవన్ భావించారు. అలా ఈ నెల 18వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టాలనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా పడినట్టుగా సమాచారం. ఏప్రిల్ రెండవ వారం నుంచి షూటింగుకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.