East Godavari District: సినీ నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేయాలంటూ రాజోలులో నాయీబ్రాహ్మణుల డిమాండ్

Nayee brahmins demand arrest for actors mohanbabu and vishnu
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణును అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నాయీబ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆ సేవా సంఘం అధ్యక్షుడు మానుకొండ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రాజోలు తహసీల్దార్ ముక్తేశ్వరరావును కలిసి వినపతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాజమహేంద్రవరానికి చెందిన నాగశ్రీను సినీ నటుడు మోహన్‌బాబు వద్ద దశాబ్దకాలంగా నమ్మకంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాంటి శ్రీనుపై దొంగతనం కేసు పెట్టి, కులం పేరుతో దూషించడం తగదని అన్నారు. మోహన్‌బాబు, మంచు విష్ణు ఆరోపిస్తున్నట్టుగా దొంగతనం జరిగిందో, లేదో దర్యాప్తు జరిపి తేల్చాలని దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
East Godavari District
Razole
Tollywood
Mohan Babu
Manchu Vishnu

More Telugu News