VV Lakshminarayana: విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థులకు ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయండి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana urges AP Govt to release scholarships for students studying in abroad
  • విద్యార్థులు స్కాలర్షిప్ హామీపై విదేశాలకు వెళ్లారని వ్యాఖ్య  
  • తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించాలని వినతి
  • స్కాలర్షిప్ లు విడుదల చేయాలని విజ్ఞప్తి
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ-పాస్ నమోదు చేయించుకుని జీవో నెం.55 ప్రకారం స్కాలర్షిప్ హామీపై ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంతోమంది ఏపీ విద్యార్థులు విదేశాలకు వెళ్లారని వివరించారు. అయితే, ఆ విద్యార్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపకారవేతనాలు విడుదల చేయాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తద్వారా విద్యార్థులకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.
VV Lakshminarayana
Scholarships
Students
Andhra Pradesh
CM Jagan
Sajjala Ramakrishna Reddy

More Telugu News