ప్రపంచంలోనే తొలిసారి పంది గుండె అమర్చుకున్న వ్యక్తి మృతి!
- ఈ ఏడాది జనవరి 7న 57 ఏళ్ల బెన్నెట్కు పందిగుండె
- జన్యు మార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను అమర్చిన వైద్యులు
- ప్రపంచ వైద్య చరిత్రలోనే కీలక ముందడుగుగా అభివర్ణణ
- రెండు నెలల్లోనే ముగిసిన సంతోషం
అయితే, గత కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు.
1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. ఓ రకం కోతి నుంచి సేకరించిన గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా ఆయన 21 రోజులు మాత్రమే జీవించారు. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితమేనని నిపుణులు చెబుతున్నారు.