ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి జైశంకర్ లకు లేఖ రాసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
- బెలారస్ లో భారత విద్యార్థులున్నారన్న గురుమూర్తి
- 1000 మందికి పైగా ఉన్నారని వెల్లడి
- వారిలో 250 మంది తెలుగు విద్యార్థులున్నట్టు వివరణ
- అందరినీ క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి
దాదాపు వెయ్యి మందికి పైగా భారత విద్యార్థులు ప్రస్తుతం బెలారస్ లో ఉన్నారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. వారిలో 250 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులను భద్రంగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.