తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు... పూర్తి వివరాలు

  • గత 24 గంటల్లో 19,527 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు
  • పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
  • ఇంకా 2,719 మందికి చికిత్స
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,527 కరోనా టెస్టులు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే రాగా... మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.   

అదే సమయంలో 401 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,083 మంది కరోనా బారినపడగా, వారిలో 7,82,253 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,719 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు.

Telangana
Corona Virus
Update
Bulletin

More Telugu News