సీబీఐ అధికారి రాంసింగ్ పై తదుపరి చర్యలొద్దు: కడప జిల్లా పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు
- రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్కుమార్ రెడ్డి ఫిర్యాదు
- కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో రాంసింగ్పై కేసు
- ఈ కేసును హైకోర్టులో సవాల్ చేసిన రాంసింగ్
అయితే కడప జిల్లా పోలీసులు తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రాంసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. రాంసింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసు విచారణలో తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.