కాళేశ్వరంలో కీలక ఘట్టం.. మల్లన్న సాగర్ జాతికి అంకితం
- మల్లన్న సాగర్ను జాతికి అంకితం చేసిన కేసీఆర్
- 58 టీఎంసీల నిల్వ సామర్ధ్యం కలిగిన మల్లన్న సాగర్
- 15.70 లక్షల ఎకరాలకు జలాశయం నుంచి సాగు నీరు
- కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయంగా మల్లన్న సాగర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయంగా నిర్మితమైన మల్లన్నసాగర్లో ఏకంగా 58 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి ఏకంగా 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఉత్తర తెలంగాణకే కాకుండా దక్షిణ తెలంగాణకు కూడా మల్లన్న సాగర్ వర ప్రసాదినిగా మారనుంది. జలాశయంలో 8 పంపులను ఏర్పాటు చేయగా.. వీటిలో ఒక్కో పంపు సామర్థ్యం 43 మెగావాట్లు.