అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధునిక కిచెన్ ప్రారంభం.. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన సీఎం జగన్
- రూ.20 కోట్లతో ఆత్మకూరులో ఏర్పాటు
- ‘జగనన్న గోరుముద్ద’కు భోజనం సరఫరా
- అక్కడి వంటకాలను రుచి చూసిన సీఎం
కాగా, కిచెన్ ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత ఆయన కూడా భోజనాన్ని రుచి చూశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలను సిద్ధం చేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. సీఎం అక్కడ్నుంచి కొలనుకొండ వెళ్లి.. ఇస్కాన్ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. రూ.70 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రాధాకృష్ణులు, వెంకటేశ్వరస్వామి ఆలయాలను అందులో నిర్మిస్తున్నారు. వాటితో పాటు ధ్యాన మందిరాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.