Jogi Ramesh: ఈ నలుగురు ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారు: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

These four persons are are against to special status says Jogi Ramesh
  • కేంద్ర కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదాను తొలగించడం దారుణం
  • అజెండా మార్పుకు చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ కారణం
  • జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యం 

ఏపీ, తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ... అజెండా మార్పు వెనుక నలుగురు వ్యక్తులు ఉన్నారని అన్నారు. చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు అజెండా మార్పుకు కారణమని... వీరంతా ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు. ఈ నలుగురు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అజెండాను మార్పించారని ఆరోపించారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం లేదని జీవీఎల్ ప్రకటించారని అన్నారు.   ముఖ్యమంత్రి జగన్ వల్లే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేకహోదాను చేర్చి, మళ్లీ తొలగించడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 17న కేంద్ర కమిటీ సమావేశం కానుంది.

  • Loading...

More Telugu News