Actress: ఒక దర్శకుడు నన్ను మోసం చేశాడు: జయవాణి

One director deceived me says actress Jayavani
  • ఒక దర్శకుడు నాతో ఫొటో షూట్ చేయించాడు
  • ఆ తర్వాత అతన్నుంచి నాకు ఫోన్ కూడా రాలేదు
  • ఆ తర్వాత ఆ ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయన్న జయవాణి 
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి జయవాణి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తొలుత 'రండి లక్షాధికారి కండి' అనే సీరియల్ ద్వారా ఆమె నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసింది. రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే సినీరంగంలోకి వచ్చిన కొత్తలో తనను ఒక దర్శకుడు మోసం చేశాడని ఆమె తెలిపింది.

తాను నల్లగా ఉన్నానని, నటిగా సెట్ కాలేనని మొదట్లో తనను చాలా మంది అవమానించారని జయవాణి చెప్పింది. ఆ సమయంలో ఒక సినిమా ఉందని, ఫొటో షూట్ కు రావాలంటూ ఓ దర్శకుడు తనను పిలిపించాడని... ఫొటో షూట్ చేసిన తర్వాత ఆయన నుంచి కనీసం ఫోన్ కూడా రాలేదని తెలిపింది.

అయితే ఆ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫొటోలు తన కెరీర్ కే ఒక మచ్చగా నిలిచిపోయాయని తెలిపింది. ఆ ఫొటోలు ఎవరు పెట్టారో కూడా తనకు తెలియదని అన్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇన్ని సినిమాల్లో నటించినా అనుకున్నంత ఫేమ్ రాలేదని చెప్పారు.
Actress
Jayavani
Tollywood
Director

More Telugu News