టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
- రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు
- టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ
- 23 అంశాలతో కూడిన బుక్ లెట్ ఎంపీలకు అందజేత
సీఎం కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశంలో 23 అంశాలను చర్చించామని, ఆ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఓ బుక్ లెట్ అందించారని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని, బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడతామని అన్నారు. విభజన అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు.