అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత
- ఎమర్సన్ ప్రాంతంలో మృతదేహాల గుర్తింపు
- సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలో మృతదేహాలు
- సరిహద్దు దాటే యత్నంలో మంచుకు బలి
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సరిహద్దుకు కొన్ని మీటర్ల దూరంలోనే ఓ పురుషుడు, స్త్రీ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలు పడి ఉన్నాయి. ఎమర్సన్ వద్ద ఓ సమూహం సరిహద్దు దాటే ప్రయత్నం చేసి ఉంటుందని, కానీ భారతీయ కుటుంబం వాతావరణం అనుకూలించకపోవడంతో బలైపోయిందని కెనడా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన భారతీయుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.