Andhra Pradesh: ఏపీలో ఈరోజు కూడా భారీగా పెరిగిన కరోనా కేసులు... అప్డేట్స్ ఇవిగో!

Andhra Pradesh registers 12615 new Corona Cases
  • గత 24 గంటల్లో 12,615 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 3,674 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,871  
ఏపీలో కరోనా కేసులు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,338 కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,674 మంది కోలుకోగా... ఐదుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,40,056కు పెరగగా... ఇప్పటి వరకు 20,71,658 మంది కోలుకున్నారు. మొత్తం 14,527 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News