కరోనా ఎఫెక్ట్.. ఆగిన శ్రీశైల మల్లికార్జునస్వామి సర్వ దర్శనం
- అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగలో పుణ్య స్నానాలు కూడా నిలిపివేత
- వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లల తల్లులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచన
- భక్తులకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరన్న ఈవో
రేపటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని కోరారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఇప్పటికే గర్భాలయ టికెట్లు పొందిన వారికి గర్భాలయ అభిషేకాలు తిరిగి ప్రారంభమైన తర్వాత వారు కోరుకున్న రోజుల్లో అభిషేకాలు జరిపించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో లవన్న తెలిపారు.