Puri Jagannadh: మహిళల కన్నీళ్లు తుడిచే పాట అది.. తప్పుగా అర్థం చేసుకున్నానన్న పూరీ జగన్నాథ్

Puri Jagannadh Explains About No Women No Cry Song
  • పూరీ మ్యూజింగ్స్ లో ‘నో విమెన్ నో క్రై’ పాటపై వివరణ
  • మహిళలు ఏడవకూడదని అర్థమన్న డైరెక్టర్
  • జమైకా తప్ప అన్ని దేశాల్లోనూ తప్పుగానే అర్థం చేసుకున్నారని కామెంట్

మహిళలు ఎప్పుడూ ఏడ్వకూడదని, ప్రపంచంలో ఆడోళ్లు లేకపోతే ఏడుపులు ఉండవన్న ఆలోచనే తప్పని ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. ‘పూరీ మ్యూజింగ్స్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పటాయ్ లోని బీచ్ పక్కన ఉన్న రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు ఓ వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. ‘నో విమెన్ నో క్రై’ అనే పాటను పాడేటప్పుడు రెస్టారెంట్లోని వాళ్లంతా అరుపులు, విజిల్స్ వేశారని, అక్కడే ఉన్న మహిళలంతా చిన్నబుచ్చుకున్నారని గుర్తు చేశారు.

రెస్టారెంట్లోని మగవారూ ఆ పాటకు గొంతు కలిపారన్నారు. అయితే, ఆ పాట భావాన్ని తనతో పాటు అక్కడ ఉన్న అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పూరీ చెప్పారు. అది ‘నో విమెన్ నో క్రై’ కాదు అని, ‘నో విమెన్ న క్రై’ అని అన్నారు. ఆ పాట అర్థం ‘మహిళలెవరూ ఏడ్వకూడదు’ అని వివరించారు. వాస్తవానికి ఆ పాటను రాసింది బాబ్ మార్లే కాదని, విన్సెంట్ ఫోర్డ్ రాసిన మాటలను తీసుకుని బాబ్ మార్లే పాడాడని చెప్పారు.

ఒక్క జమైకా తప్ప అన్ని దేశాల్లోనూ ఆ పాటను తప్పుగానే అర్థం చేసుకున్నారని చెప్పారు. ‘నో విమెన్ నో క్రై’ అనే పదాన్ని తప్ప.. వేరే లిరిక్స్ ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇకపై ఆ పాట విన్నప్పుడు గోల చేయకూడదని, అది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని తెలిపారు.

  • Loading...

More Telugu News