యడ్లపాడు పోలీసుల అదుపులో కరుడుగట్టిన పాణ్యం గ్యాంగ్ రేప్ ముఠా
- కర్నూలు జిల్లా పాణ్యం ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
- కూలి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ దోపిడీలు, అత్యాచారాలు
- గుంటూరు జిల్లాలో 30కి పైగా అత్యాచారాలు, దారి దోపిడీలు
అలాగే, యడ్లపాడు పరిధిలో రెండు జంటలపై దాడిచేసి దోపిడీకి పాల్పడింది. మరో ఘటనలో ద్విచక్ర వాహనంపై తల్లితో కలిసి వస్తున్న యువకుడిని అడ్డగించిన ముఠా సభ్యులు అతడిని తీవ్రంగా కొట్టి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. వేలి ముద్రల ఆధారంగా ముఠా సభ్యులను కర్నూలు జిల్లా పాణ్యం ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు కూలి పనుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటారని పోలీసులు తెలిపారు. జిల్లాలో 30కి పైగా అత్యాచారాలు, దారి దోపిడీలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు.