పాకిస్థాన్ లో నవ శకం.. సుప్రీంకోర్టు జడ్జిగా మహిళ!
- పాక్ సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ఎంపిక
- ఆయేషాను ఐదు ఓట్ల మెజార్టీతో ఆమోదించిన పాక్ జ్యుడీషియల్ కమిషన్
- హార్వర్డ్ లా స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయేషా
లాహోర్ లోని 'పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా'లో ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత లండన్ లోని హార్వర్డ్ లా స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం కరాచీలో న్యాయవాదిగా పని చేశారు. ఆ తర్వాత తన కెరీర్లో పలు జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్, హైకోర్టుల్లో సేవలందించారు. ఆమె ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.