అండర్-19 ఆసియా కప్ గెలిచిన టీమిండియా కుర్రాళ్లు... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం
- దుబాయ్ లో ఆసియాకప్ అండర్-19 టోర్నీ
- ఫైనల్లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత్
- రాణించిన ఓపెనర్ రఘువంశి
- మరోసారి ఆకట్టుకున్న గుంటూరు కుర్రాడు రషీద్
కాగా, మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. వికీ ఓస్త్వాల్ 3, కౌశల్ తంబే 2, రాజ్ వర్ధన్ హంగార్గేకర్ 1, రవికుమార్ 1, రాజ్ బవా 1 వికెట్ తీశారు. లంక జట్టులో యసిరు రోడ్రిగో చేసిన 19 పరుగులే అత్యధికం.
అనంతరం డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించారు. ఏమంత కష్టసాధ్యం కాని ఈ లక్ష్యాన్ని టీమిండియా 21.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఛేదించింది. ఓపెనర్ రఘువంశి 56 పరుగులతోనూ, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 31 పరుగులతోనూ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక జట్టులో యసిరు రోడ్రిగో ఒక వికెట్ సాధించాడు.