ఒమిక్రాన్ విజృంభించినా సభలు, సమావేశాలు ఆపబోం.. వర్చువల్గా చేపడతాం: బీజేపీ
- దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు
- ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సందిగ్ధం
- వర్చువల్గా సభలు, సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం
ఒమిక్రాన్ కారణంగా ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి కనుక నిరాకరిస్తే తాము వర్చువల్గా ముందుకెళ్తామని బీజేపీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలోనూ తాము ఇలానే ముందుకెళ్లినట్టు గుర్తు చేసింది. వర్చువల్గానే సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ గజేంద్ర షెకావత్ తెలిపారు.