ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందంటూ సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ
- విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడేయొద్దని హితవు
- సాంకేతిక లోపాలు పరిష్కరించాలని సూచన
- యూజర్ ఫ్రెండ్లీ విధానాలు అవసరమని వ్యాఖ్య
- విధివిధానాలు సంస్కరించాలంటూ లేఖ
సాంకేతిక లోపాలు లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా వెబ్ సైట్ ను అప్ డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ఏ విధంగా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోందో తప్పనిసరిగా వివరించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై మరింతగా ప్రతిస్పందించేలా, సమస్యలు నివేదించే విద్యార్థుల పట్ల యూజర్ ఫ్రెండ్లీ తరహాలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విధివిధానాలను, ప్రోటోకాల్స్ ను సంస్కరించాలని పేర్కొన్నారు.

