'ఆకతాయి' అనే పేరును రాహుల్ గాంధీ సార్థకం చేసుకుంటున్నారు: బీజేపీ నేత అమిత్ మాలవీయ
- సభలో పరిణామాలపై రాహుల్ ను ప్రశ్నించిన పాత్రికేయుడు
- ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నావా అంటూ రాహుల్ ఆగ్రహం
- స్పందించిన బీజేపీ నేత మాలవీయ
- రాహుల్ కు చర్చించేంత సమర్థత లేదని విమర్శలు
'ఆకతాయి' అనే పేరును రాహుల్ సార్థకం చేసుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంటులో విపక్షాల గందరగోళంపై ప్రశ్నించిన పాత్రికేయుడిపై రాహుల్ విరుచుకుపడ్డారని అన్నారు. "వివిధ అంశాలపై చర్చకు రావాలంటూ విపక్షాలను ప్రభుత్వం కోరుతోంది. కానీ కాంగ్రెస్ ముందుకు రావడంలేదు. కాంగ్రెస్ పార్టీకి గానీ, రాహుల్ గాంధీకి గానీ చర్చించేంత సమర్థత లేదు. అందుకే సభలో అల్లరి చేస్తున్నారు" అంటూ మాలవీయ ట్వీట్ చేశారు.