ఏపీలో కొత్తగా 181 కరోనా కేసులు... అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 176 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,011
  • ఇప్పటి వరకు కరోనా వల్ల 14,457 మంది మృతి
ఏపీలో గత 24 గంటల్లో 31,957 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,217కి పెరిగింది. ఇప్పటి వరకు 20,57,749 మంది కోలుకున్నారు. 14,457 మంది మృతి చెందారు.


More Telugu News

Andhra Pradesh Corona Virus Updates