బూస్టర్ డోస్ పై రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
- బూస్టర్ డోస్ కోసం అదనపు వ్యాక్సిన్లను పంపాలన్న ఏపీ, కర్ణాటక, కేరళ
- బూస్టర్ డోస్ అవసరమని మీకెవరు చెప్పారని ప్రశ్నించిన కేంద్రం
వివిధ రాష్ట్రాల వైద్యశాఖ అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూస్టర్ డోస్ అంశాన్ని ఈ మూడు రాష్ట్రాల అధికారులు లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్ర వైద్యశాఖ అధికారులు.. బూస్టర్ డోసు అవసరమని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఐసీఎంఆర్ సిఫారసు చేస్తే... అప్పుడు ఈ అంశంపై తాము ఆలోచిస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు బూస్టర్ డోసు ప్రస్తావనను ఎవరూ తీసుకురావద్దని అన్నారు.