ఏపీ గవర్నర్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న గవర్నర్
- కరోనా అనంతర లక్షణాలతో బాధపడుతున్న వైనం
- మరోసారి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
కొన్నిరోజుల క్రితం గవర్నర్ హరిచందన్ దంపతులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాదు తరలించారు. నవంబరు 17న ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించారు. ఆపై కరోనా నెగెటివ్ రాగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో వారిని ఈ నెల 23న డిశ్చార్జి చేశారు.
అయితే స్వల్ప స్థాయిలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడంతో ఆయనను మరోసారి హైదరాబాద్ తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా అనంతరం సాధారణంగా కనిపించే స్వల్ప డయేరియా, రక్తహీనత, వాపు తదితర అంశాలను గుర్తించారు.