వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం చక్కర్లు.. యూపీలో టెట్ రద్దు
- నెల రోజుల తర్వాత మళ్లీ పరీక్ష
- 23 మంది అనుమానితుల అరెస్ట్
- బ్లాక్లిస్టులో ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీ
- జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామన్న యూపీ సీఎం
ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీని అధికారులు బ్లాక్లిస్ట్లో పెట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేస్తారని తెలిపారు.