Andhra Pradesh: ఏపీలో మరో 183 మందికి కరోనా పాజిటివ్

AP Corona details
  • గత 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 30 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,194 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు.

అదే సమయంలో 163 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,014 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,194 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,431కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Details
Today Cases

More Telugu News