పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మద్దతు
- ఏపీ రాజధాని విషయంలో మారిన బీజేపీ వైఖరి
- తిరుపతి పర్యటనలో ఏపీ నేతలకు తలంటిన అమిత్ షా
- త్వరలోనే ఏపీ వెళ్లి రైతులను కలవనున్న బండి సంజయ్
ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. తాజాగా బండి సంజయ్ వారికి అండగా నిలిచారు. త్వరలోనే ఆయన రాజధాని రైతులను కలవనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వెళ్లి రైతుల్ని కలిసి సంఘీభావం తెలపాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.