క్షమాపణలు తెలిపిన 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్

Jai Bheem director Jnanavel apologizes
  • సూర్య హీరోగా జై భీమ్ చిత్రం
  • వన్నియార్ కులాన్ని కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు
  • చిత్రంపై పట్టాళి మక్కళ్ కట్చి తీవ్ర ఆగ్రహం
  • వివరణ ఇచ్చిన జ్ఞానవేల్
ఇటీవల విడుదలైన జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని సీన్లు వన్నియార్ కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జై భీమ్ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ స్పందించారు. తమ చిత్రంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్షమాపణలు తెలుపుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ కులాన్ని, ఏ వ్యక్తిని కించపరిచే ఉద్దేశంతో తాము సినిమా తీయలేదని స్పష్టం చేశారు. ఎవరికైనా జై భీమ్ చిత్రంతో ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు.

ఈ వివాదానికి హీరో సూర్య బాధ్యత వహించాలనడం సబబు కాదని జ్ఞానవేల్ స్పష్టం చేశారు. సూర్య ఓ నిర్మాతగా, నటుడిగా జై భీమ్ చిత్రం ద్వారా ఓ గిరిజన తెగ ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు అకారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నారని జ్ఞానవేల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదం వచ్చినందుకు సూర్యను కూడా క్షమించమని కోరతానని వెల్లడించారు.
Go Back to Shorts
Gnanavel
Jai Bheem
PMK
Vanniyar
Suriya
Tamilnadu

More Telugu News