ఎప్పుడూ ఫాంహౌస్ లో ఉండే సీఎంను బయటికి రప్పించాం: బండి సంజయ్
- బండి సంజయ్ ప్రెస్ మీట్
- సీఎం కేసీఆర్ పై విమర్శలు
- కేసీఆర్ దీక్ష రైస్ మిల్లర్ల కోసమేనని ఆరోపణ
- చాలా అంశాల్లో బీజేపీ విజయం సాధించిందని వెల్లడి
అయితే కేసీఆర్ దీక్ష చేసింది రైతుల కోసం కాదని, రైస్ మిల్లర్ల కోసమేనని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ దీక్షకు, ప్రధాని మోదీ రైతు చట్టాలు రద్దు చేయడానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. "ఇక్కడ నువ్వు దీక్ష చేసింది ధాన్యం కొనుగోలు గురించి... అక్కడ మోదీ రద్దు చేసింది రైతు చట్టాలను. ఇక్కడ నువ్వు తిడితే మోదీ అక్కడ రద్దు చేశారా? ఇంతకీ నువ్వు దీక్ష చేసింది పంజాబ్ రైతుల కోసమా, తెలంగాణ రైతుల కోసమా?" అని నిలదీశారు.