విజయ్ రోల్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసిన వంశీ పైడిపల్లి!
- వరుస హిట్లతో విజయ్
- షూటింగు దశలో 'బీస్ట్'
- నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
- నిర్మాతగా దిల్ రాజు
- కథానాయికగా కియారా
ఈ సినిమా తరువాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది.
ఈ సినిమాలో విజయ్ ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటాడట. తన మనసుకి నచ్చినవారు .. తనని ఆరాధిస్తున్నట్టు .. తన కోసం టైమ్ స్పెండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందట. అలాంటి ఒక పాత్రలో విజయ్ ని వంశీ చూపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని పేరు కనిపిస్తోంది.