అనంతపురం జిల్లా కదిరిలో దారుణం.. దోపిడీ దొంగల చేతిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దారుణ హత్య
- కదిరిలో చెలరేగిపోయిన దోపిడీ దొంగలు
- దోపిడీని అడ్డుకున్నందుకు హత్య
- మరో ఇంట్లోని మహిళపైనా దాడి
ఆపై పక్కనే ఉన్న మరో ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లోని మహిళపై దాడిచేసి దోచుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు.