‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న భద్రాద్రి కొత్తగూడెం ఎస్సై!
- ఎన్టీఆర్ హోస్ట్గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో
- కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి ఫిక్స్ చేయమన్న రాజారవీంద్ర
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో
- రేపు ప్రసారం కానున్న షో
హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా, రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న విషయంపై షో నిర్వాహకులు ఇంకా పెదవి విప్పకపోవడంతో సస్పెన్స్గా మారింది.