Andhra Pradesh: కాకినాడలో ఉద్రిక్తత.. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట

Students Confronted Police In Kakinada
  • కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా
  • ఐడీఎల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్
  • వర్షంలోనూ నిరసన కొనసాగించిన స్టూడెంట్స్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థులు కదం తొక్కారు. ఐడీఎల్ ఎయిడెడ్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బారికేడ్లు, కలెక్టరేట్ గేటును తోసుకుంటూ లోపలికెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఓ దశలో విద్యార్థులు కలెక్టరేట్ లోపలికిరాగా.. వారందరినీ బయటకు పంపించి గేటు మూసేశారు. అయినాగానీ తగ్గని విద్యార్థులు వర్షంలోనూ నిరసనను కొనసాగించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు. అంతకుముందు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News