Ayodhya: దీపాల వెలుగులో సరయు నదీ సోయగం... గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన అయోధ్య నగరం

Ayodhya city entered into Guinness Book
షార్ట్స్‌లో చూడండి
దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో వెలుగులు విరజిమ్మింది. అంతేకాదు, ప్రపంచ రికార్డు కూడా సాధించింది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని ఇక్కడి సరయు నదీ తీరంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఒక్కసారే లక్షల దీపాలు ప్రజ్వలనం చేయడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండువలా మారింది.

ఇక్కడి రామ్ కీ పైడీ ప్రాంతంలో ఇలా చమురుతో దివ్వెలు వెలిగించడం వరుసగా ఐదోసారి కూడా గిన్నిస్ రికార్డు పుటల్లోకెక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్టు నిర్ధారించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Go Back to Shorts
Ayodhya
Guinness Record
Lights
Diwali

More Telugu News