Andhra Pradesh: ఏపీలో కొత్తగా 567 కేసుల నమోదు

Ap registers 567 new corona cases
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు 
  • రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,777
ఏపీలో గత 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,64,854 కేసులు నమోదు కాగా... 20,45,713 మంది కోలుకున్నారు. మొత్తం 14,364 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Update

More Telugu News