Telangana: తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ నేత!

New political party to come in Telangana
  • కొత్త పార్టీని ప్రారంభించనున్న డాక్టర్ వినయ్
  • సాయంత్రం కాంగ్రెస్ కు రాజీనామా చేసే అవకాశం
  • డిసెంబర్ లో పార్టీ పేరు ప్రకటన
  • కేంద్ర మాజీమంత్రి శివశంకర్ తనయుడే వినయ్ 
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని ప్రారంభించనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన తన మద్దతుదారులతో భేటీ అయ్యారు.

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడే వినయ్ అనే విషయం గమనార్హం. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అనంతరం కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీ పేరును ఆయన డిసెంబర్ లో ప్రకటించనున్నట్టు సమాచారం.
Telangana
New Political Party
Doctor Vinay Kumar
Congress

More Telugu News