KCR: వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్.. నేడు ఏకగ్రీవంగా ఎన్నిక

KCR To be elect TRS chief consecutive 10th time
  • 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావం
  • అప్పటి నుంచి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న కేసీఆర్
  • దేశంలో సుదీర్ఘకాలంపాటు పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా రికార్డుల్లోకి

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరుసగా పదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నేడు జరగనున్న పార్టీ ప్లీనరీలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 27 ఏప్రిల్ 2001న కేసీఆర్ అధ్యక్షుడిగా 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. ఆ తర్వాత వరుసగా జరిగిన ప్లీనరీల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. నేడు జరగనున్న ప్లీనరీ పదోది కాగా, ఈసారి కూడా పార్టీ నేతలు ఆయననే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా సుదీర్ఘకాలంపాటు ఓ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారి జాబితాలో కేసీఆర్ కూడా చేరనున్నారు.

  • Loading...

More Telugu News