ఓటమి ఖాయమనే విషయం సోము వీర్రాజుకు తెలుసు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
- టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారు
- బద్వేలులో నీటి సమస్యపై వీర్రాజు విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నాం
- రోడ్లు, డ్రైనేజీల సమస్యకు వైసీపీ ప్రభుత్వంలోనే పరిష్కారం దొరుకుతుంది
బద్వేలులో నీటి సమస్యపై సోము వీర్రాజు విసిరిన సవాల్ ను వైసీపీ స్వీకరిస్తోందని చెప్పారు. బద్వేలు ప్రజలకు తాగునీరు ఇచ్చింది వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే అని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యకు వైసీపీ ప్రభుత్వంలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. బద్వేల్ లో ఓటు వేయమని అడిగే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని అన్నారు.