ఆరెస్సెస్ కు చెందిన వ్యాపారవేత్త రూ.300 కోట్లు లంచం ఇవ్వజూపారు: మేఘాలయ గవర్నర్ సంచలన ఆరోపణలు
- కశ్మీర్ గవర్నర్ గా ఉన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించా
- ప్రధాని మోదీ నా నిర్ణయాన్ని సమర్థించారు
- అవసరమైతే పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యా
ఆ ఫైళ్లు ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆరెస్సెస్ తో సంబంధం ఉన్న వ్యక్తికి సంబంధించినవని వెల్లడించారు. ఒత్తిళ్లకు భయపడకుండా విజ్ఞప్తిని తిరస్కరించానన్నారు. ప్రధాని మోదీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించారని చెప్పారు. పదవిని వీడేందుకూ తాను సిద్ధమయ్యానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.