జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్లో మిస్ అయిన జవాన్ల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్
- సోమవారం నుంచి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
- ఇప్పటి వరకు ఏడుగురు జవాన్ల మృతి
- ఎన్ కౌంటర్ లో ఇంతవరకు ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు
ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు సైనికులు మరణించారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు జవాన్లు మరణించారు. దీంతో చనిపోయిన జవాన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ స్థాయిలో జవాన్లను కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఒక్క ఉగ్రవాది కూడా చనిపోకపోవడం గమనార్హం.