అమ్మఒడి పథకాన్ని జూన్కు వాయిదా వేయడం అందులో భాగమే!: అచ్చెన్నాయుడు
- అమ్మఒడి పథకంలో జగన్ది తొలి నుంచీ మోసమే
- తొలుత రూ. 15 వేలు, ఆ తర్వాత రూ. 14 వేలు, ఇప్పుడు ల్యాప్టాప్లు అంటున్నారు
- 75 శాతం హాజరు చూపించి జూన్ నాటికి వాయిదా వేయడం దారుణం
ఇందులోనూ బోల్డన్ని మార్పులు చేశారని విమర్శించారు. తొలుత రూ. 15 వేలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత 14 వేలు అన్నారని, ఇప్పుడు డబ్బులకు బదులు ల్యాప్టాప్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజలను ఊరించి మోసగించడం జగన్కు మాత్రమే సాధ్యమని అన్నారు. హాజరు పేరుతో ఇప్పుడు మొత్తం పథకానికే ఎగనామం పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ పథకాన్ని జూన్కు వాయిదా వేయడం అందులో భాగమేనని అన్నారు.
కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోయినా పథకాన్ని అమలు చేస్తామని గతంలో గొప్పలు చెప్పారని, ఇప్పుడు 75 శాతం హాజరు చూపించి పథకం అమలును వాయిదా వేయడం దారుణమని అచ్చెన్నాయుడు ఫైరయ్యారు.