Telangana: స్పీకర్ పోచారం కాన్వాయ్ లోని కారు ఢీకొని ఒకరి మృతి

  • ప్రైవేట్ ఉద్యోగి నర్సింహారెడ్డిగా గుర్తింపు
  • తీవ్రగాయాలతో స్పాట్ లోనే మృతి
  • మనోహరాబాద్ మండలంలో ప్రమాదం
Speaker Pocharam Convoy Car Hits a Man On Road

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ లోని కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. అతడిని నర్సింహారెడ్డిగా గుర్తించారు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News