Andhra Pradesh: ఏపీలో కొత్తగా 643 కరోనా కేసుల నమోదు

AP registers 643 new Corona cases
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు
  • 24 గంటల్లో 8 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,550
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది మృతి చెందారు. 839 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరుకుంది. మొత్తం 20,32,520 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోగా... ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
updates

More Telugu News